జిల్లాలోని ప్రజలను సైబర్ నేరాల నుండి రక్షించేందుకు ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు గురువారం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. నేరాల బారిన పడకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఆ వీడియోలో పొందుపరిచారు. సైబర్ నేరాల బారిన పడితే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు సమాచారం అందించాలని, ప్రజల అప్రమత్తతోనే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని ప్రకాశం పోలీసు శాఖ ప్రకటించింది.