వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకంలో అవకతవకలు జరిగినట్లుగా మాజీ ఆరోగ్యశ్రీ స్పెషల్ అధికారి అశోక్ బాబు తెలిపారు. ఒంగోలులోని ప్రైవేట్ అతిథి గృహంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించిన ఆసుపత్రులన్నీ వైసీపీకి చెందిన వారివేనని ఆయన ఆరోపించారు. తాను వైద్యశాల లో వెరిఫికేషన్ కు వెళితే వారు అడ్డుపడి తనపై పత్రికల్లో చెడుగా రాయించారని అశోక్ బాబు పేర్కొన్నారు.