రేపల్లె నియోజకవర్గం లో గడిచిన 24 గంటల్లో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గురువారం నుండి శుక్రవారం వరకు రేపల్లె మండలం లో 0. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నగరం మండలంలో 6. 2 మిల్లీమీటర్లు, నిజాంపట్నం మండలంలో 6. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చెరుకుపల్లి మండలంలో వర్షపాతం ఏమి నమోదు కాలేదని అధికారులు తెలిపారు.