సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లాకు రానున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. సంతానవతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో జరగనున్న ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2: 30 గంటల సమయంలో ఆయన వస్తారని టీడీపీ నాయకులు తెలిపారు.