జూలై 1వ తేదీన ఎన్టీఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రానున్నట్లు టీడీపీ కూటమి ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు తెలిపారు. ఎర్రగొండపాలెం సచివాలయం 3 పరిధిలోని పోతు రాజు గడ్డ సమీపంలో ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన సభ స్థలాన్ని ఆయన శనివారం నాయకులైన చిదేళ్ల నాగేశ్వరరావు, మూడమంచు శ్రీనివాస్, అచ్యుత రావు తదితర నాయకులతో కలిసి పరిశీలించారు.