ఇరూ వర్గాల మధ్య ఘర్షణ ఆరుగురికి గాయాలు

67చూసినవారు
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ పొలం వివాదంలో ఓవర్గంపై మరో వర్గం కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ దాడిలో మొత్తం 6 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని స్థానిక మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్