రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ను అద్దంకి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులను గరటయ్య మంత్రితో చర్చించారు. జిల్లాలో ముస్లింల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి ఫరూక్ తెలియజేశారు. ముస్లింల పరంగా ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.