పంగులూరు మండలం కొప్పెరపాడు వద్ద శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనపై అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హేబేలు స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారుల చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.