పంగులూరు మండలం పంగులూరు జాతీయ రహదారి వద్ద సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు జింకలు మృతి చెందాయి. స్థానికుల సమాచారంతో హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని జింకల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. జింకలు సుబాబుల్ తోటల్లో తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.