వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రికి గాయాలు

83చూసినవారు
చీరాల‌లో శనివారం రెండు వేర్వేరు ప్ర‌దేశాల్లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. చీరాల ఆర్వోబి పై భైకును కారును ఢీకొన్న సంఘ‌ట‌న‌లో ల‌క్ష్మీపురానికి చెందిన రాము అనే యువ‌కుడికి గాయాల‌య్యాయి. పేరాల చిన‌ర‌థం సెంట‌ర్‌లో లారీ ఢీకొన్న సంఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి కాలు పూర్తిగా విరిగిపోయి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటురు ప్ర‌భుత్వ వైద్యశాల‌కు త‌ర‌లించారు.

సంబంధిత పోస్ట్