అకాల వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాళ్లూరు తహసిల్దార్ సంజీవ్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తహసిల్దార్ సంజీవరావు మాట్లాడుతూ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే సమయంలో ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలలో ప్రజలు ఉండరాదని ఆయన సూచించారు. రాష్ట్ర విపత్తు శాఖ సూచనలను తప్పనిసరిగా ప్రజలు పాటించాలని తెలిపారు.