రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి మండలం చందలూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మెస్ఎంజి పార్క్ ను శుక్రవారం దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి ఈ పార్కును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.