ముండ్లమూరు మండలం మారెళ్ళ చెరువులో అక్రమంగా గ్రావెల్ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జెసిబిల సహాయంతో అక్రమార్కులు చెరువు మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.