ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనంపై అక్రమంగా గోవా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 54 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని సీఐ కొండారెడ్డి మీడియాకు తెలిపారు. మద్యం తరలించేందుకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.