కంభం ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్

79చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం ఎక్సైజ్ కార్యాలయాన్ని డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఎక్సైజ్ అధికారులు మరియు సిబ్బందితో ఆయన మాట్లాడారు. మద్యం బెల్ట్ షాపులు అరికట్టడం, నాటు సారా నిర్మూలించడం, బహిరంగ ప్రదేశాలలో మద్యపానం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నాటు సారా నిర్మూలనకు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్