ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామంలో బుధవారం బలమైన ఈదురుగాల వల్ల అరటి చెట్లు నేలకొరిగాయి. దీంతో రైతు షేక్ మదర్ వలి రూ. 3 లక్షల వరకు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక కూటమి నాయకులు గురువారం పొలాన్ని పరిశీలించి అధికారులకు సమాచారం ఇచ్చారు. నష్టపోయిన రైతుకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.