ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉగ్రవాదులను ఎరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూరపు మద్దతు తెలుపుతూ శుక్రవారం జీవన్ జ్యోతి డిగ్రీ కళాశాల ఎన్సిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులను ఏరువేస్తున్న ఆర్మీకి సెల్యూట్ తెలిపారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో అవసరమైతే తమ సేవలు అందించేందుకు కూడా సిద్ధమని ఎన్సిసి విద్యార్థులు అన్నారు.