గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో కమీషనర్ వెంకట దాసు శుక్రవారం నీటి సమస్యపై సంబంధిత అధికారులు సిబ్బందితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో నీటి సమస్య తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వారికి వివరించారు. గుండ్ల మోటు నుంచి పట్టణానికి నీటి సరఫరా చేసే మూడు మోటర్లు చెడిపోయినట్లుగా కమిషనర్ దృష్టికి వారు తీసుకువెళ్లారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కమిషనర్ అన్నారు.