గిద్దలూరులోని గాంధీ బొమ్మ వద్ద గురువారం ఓ లారీ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో అటువైపు నుంచి వెళ్లే వాహనాలన్నీ పోలీస్ స్టేషన్ రోడ్డు మీదుగా వెళ్తుండడంతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బ్రిటన్ స్ట్రీట్ ద్వారా వచ్చే పెద్ద వాహనాలన్నీ పట్టణంలో నుంచి వస్తుండడంతో పాదచారులు చిన్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లారీ డ్రైవర్ క్లీనర్ లారీలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించే పనిలో ఉన్నారు.