ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరంలో పిడుగుపాటుకు తలుపులు బాలకాశయ్య, అతని భార్య కోటిలింగమ్మ, మార్కండేయుడు, తలుపులు మార్కండేయుడు గాయపడటంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. విషయం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ దృష్టికి రావడంతో బుధవారం రాత్రి గ్రామానికి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించారు. మెరుగైన వైద్య కోసం మార్కాపురం తరలించాలని అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు.