ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ లో మంగళవారం రాత్రి పానీ పూరి బండి నిర్వాకుడిపై కొంతమంది యువకులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. పానీపూరి తినేందుకు వచ్చిన యువకులు పానీ పూరి రుచిగా లేదంటూ నిర్వహిడితో గొడవ పెట్టుకున్నారు. తర్వాత దాడి చేయడంతో అందరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.