ప్రకాశం జిల్లా, కంభం మండలం తురిమెళ్ళ గ్రామంలో అడవుల సంరక్షణపై అటవీశాఖ అధికారులు శనివారం స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అడుగులకు నిప్పు పెట్టడం వల్ల కలుగు అనర్ధాలను ప్రజలకు వివరించారు. వన్యప్రాణులను అడవులను సంరక్షించే విషయంలో ప్రజలు అటవీశాఖ అధికారులకు సహకరించాలని డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ నిషాకుమారి ప్రజలను కోరారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.