కంభం: డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసిన సీఐ

51చూసినవారు
కంభం: డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసిన సీఐ
ప్రకాశం జిల్లా కంభంలోని జాతీయ రహదారిపై బుధవారం వాహనదారులకు సీఐ మల్లికార్జునరావు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనం నడుపుతున్న వాహనదారులపై ఆయన కేసు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వాహనదారులను సిఐ తీవ్రంగా హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్