కంభం మండలం రావిపాడు గ్రామ సమీపంలో మంగళవారం బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న ఇద్దరు వ్యక్తులకు స్థానిక సీఐ మల్లికార్జున కౌన్సిలింగ్ ఇచ్చారు. వారికి జరిమానా విధించడంతోపాటు మరో మారు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటానని వారిని తీవ్రంగా హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో ఎవరు మద్యం తాగారాదని అలా నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం తాగితే జరిమానా విధిస్తామని సీఐ హెచ్చరించారు.