ప్రకాశం జిల్లా కంభం, గిద్దలూరు కు చెందిన ఎక్సైజ్ అధికారులు గోవా మద్యం సరఫరా చేసే మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు. శుక్రవారం వెల్లడించారు. కంభం గిద్దలూరు పరిసర ప్రాంతాలకు గోవా మద్యం సరఫరా చేస్తున్న నిందితుడు దేవేంద్రన్ వీరప్పన్ శెట్టి ని ముంబై పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కంభం, గిద్దలూరు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.