బేస్తవారిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ మహిళను బుధవారం ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ వద్ద నుంచి పది క్వాటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి వెల్లడించారు. అక్రమంగా మద్యం కలిగి ఉండడం లేదా మద్యం బెల్టు షాపులు నిర్వహించడం చట్టరీత్యా నేరమని సీఐ కొండారెడ్డి ప్రజలను హెచ్చరించారు.