ప్రకాశం జిల్లా గిద్దలూరు, రాచర్ల మండలాలలో నేడు శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. రాచర్ల మండలం ఎడవల్లి, గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరమత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ప్రజలు సహకరించవలసిందిగా ఏ. ఈ కోరారు. నిర్ణీత సమయంలో విద్యుత్ సరఫరా పునర్దరిస్తామని అన్నారు.