రాచర్ల మండలం జేపీ చెరువులోని నెమిలిగండ్ల రంగనాయకస్వామి ఆలయంలో శనివారం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.