ఉగ్రదాడుల నేపథ్యంలో నేషనల్ హైవేపై పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం టంగుటూరు మండల పరిధిలోని కోల్ కత్తా, చెన్నై జాతీయ రహదారిపై స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని పరిశీలించడంతో పాటు కొత్త వారిని ఆరా తీసారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని ఎస్ఐ అన్నారు. అనుమానంగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.