కనిగిరి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 52 కేసులు పరిష్కారం అయినట్లు న్యాయమూర్తి కె. భరత్ చంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ క్రిమినల్ కేసులు 46, సివిల్ కేసులు2, భరణం కేసులు 4 ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు. కక్షలు, కార్పణ్యాలకు వెళ్లకుండా రాజీ మార్గంలో వెళ్లి రాజ మార్గాన్ని అనుసరించాలని జడ్జి కె. భరత్ చంద్ర సూచించారు.