క్రమం తప్పకుండా పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. బుధవారం దేవాంగ నగర్ అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది పిల్లలకు వేయుచున్న వ్యాధి నిరోధక టీకాలను పరిశీలించ్చారు. ఆయన మాట్లాడుతూ టీకాలు వేయించడంతోపాటు పిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలని తల్లులకు సూచించారు. తల్లిపాలు తాగించడం ద్వారా పిల్లలు ఆరోగ్య వంతులు అవుతారని తెలిపారు.