ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో కాపీయింగ్ జోరు తగ్గలేదు. బుధవారం ఒకేరోజు మూడు కేంద్రాల్లో ఎనిమిది మంది విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడ్డారు. కనిగిరిలో ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో జరుగుతున్న వ్యవహారంపై స్పందించి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కార్యాలయం నుంచి కోఆర్డినేటర్ అక్బర్ ఆలీఖాన్ కనిగిరిలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను డీ బార్ చేసారు.