సిఎస్పురం మండలం గణేశునిపల్లి గ్రామంలో నిర్మించనున్న శ్రీ ఇష్ట కామాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం కోసం మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు రూ.4 లక్షల విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆయన సోదరుడు కదిరి పార్థసారథి శుక్రవారం కమిటీకి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ఎంపిటిసీలు పాల్గొన్నారు.