కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు ఈనెల 19వ తేదీన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ గుంటూరు శంకర నేత్ర వైద్యశాల, జననీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ వైద్య శిబిరం జరుగుతుందన్నారు. నేత్ర వైద్య శిబిరంలో వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తామన్నారు.