భారత్ పై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. మార్కెట్ యార్డ్ సమీపంలోని ఆయన వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాధవరావు మాట్లాడుతూ ఏదైనా సమాజానికి హాని కలిగించే మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే సహించేది లేదని వాహనదారులను ఆయన హెచ్చరించారు.