కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. కనిగిరిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బైపీసీలో 1000/989 మార్కులు సాధించిన షేక్ నజ్మాను డీఎస్పీ సోమవారం అభినందించారు. విద్యార్థి తండ్రి మహమ్మద్ తోపుడు బండితో పండ్ల వ్యాపారం చేస్తూ కష్టపడి కూతురిని చదివించడం అర్షనీయమని డీఎస్పీ అన్నారు.