చంద్రశేఖరపురం మండలంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని సీపీఎం పార్టీ నాయకులు ఊసా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం తహసిల్దార్ కు విన్నవించారు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఇల్లు లేని పేదలు తిరుగుతున్నారని వారికి న్యాయం చేయాలన్నారు. పేదల సమస్యలపై స్పందించకుంటే సీపీఎం పార్టీ తరపున ఆందోళన చేస్తామన్నారు.