కనిగిరి మండలంలోని చాకిరాల అంగన్వాడీ కేంద్రాల్లో కిషోర్ బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కనిగిరి సీడీపీఓ సరోజని మాట్లాడుతూ యువతకు ఆత్మ సంరక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను, సైబర్ నేరాలు, సెల్ఫోన్ ద్వారా అపరిచిత వ్యక్తులతో సంభాషణలు చేయకూడదని వివరించారు. అలాగే, బాల్య వివాహాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.