వేసవి సెలవులలో విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి ఎస్సై శ్రీరామ్ అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ పిల్లలు చెరువులు, నీటి కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ
వహించాలని సూచించారు. పిల్లలను ఎండలో బయటకు తిరగకుండా ఇంటి వద్దనే ఉండే విధంగా చూసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.