కనిగిరి మండలంలోని చిన్న ఇర్లపాడులో బుధవారం రాత్రి కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన డీఎస్పీ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ శక్తి యాప్ ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వేసవిలో జరిగే దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.