పామూరులో ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన సంగతి తెలిసిందే. సోమవారం సీఐ భీమా నాయక్ హత్యా ప్రదేశాన్ని పరిశీలించారు. మద్యం, మత్తు పదార్థాలకు బానిసై క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హంతకుడిని త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు.