కనిగిరిలోని స్థానిక దర్శి చెంచయ్య భవన్ నందు శనివారం సీపీఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఎనుబరి పురుషోత్తం 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కనిగిరి మండలం ఎరువారిపల్లి గ్రామంలో పుట్టి ఉన్నత చదువులు చదివి కమ్యూనిజం సిద్ధాంతాలపై అభిమానంతో పార్టీకి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి కామ్రేడ్ పురుషోత్తం అని అన్నారు.