ఈనెల 14న జరగనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కనిగిరిలో ఘనంగా నిర్వహించేందుకు దళిత సంఘాలు ఏర్పాటు చేస్తున్నాయి. అందులో భాగంగా దళిత సంఘాల నాయకులు పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి రంగులు వేసి ముస్తాబు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న దళిత నాయకులు ఆయన జయంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.