సిఎస్ పురం మండలంలోని రేగులచెలక పంచాయతీ లోని గణేశునిపల్లి గ్రామంలో నూతనంగా ఇష్ట కామాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం నిర్మిస్తున్నారు. ఈ దేవస్థానం నిర్మాణానికి కనిగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ కదిరి బాబురావు 4 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ విరాళాన్ని కదిరి బాబురావు సోదరుడు కదిరి పార్థసారథి శుక్రవారం దేవస్థానం కమిటీ సభ్యులు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు