కనిగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

67చూసినవారు
కనిగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కనిగిరి మున్సిపల్ పరిధిలోని పొగాకు వేలం కేంద్రం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కనిగిరి మండలం పట్టాభిరాంపురం గ్రామానికి చెందిన పోలయ్య, అనూక్ కనిగిరి నుండి బైక్ పై స్వగ్రామానికి వెళుతుండగా ఒంగోలు నుండి వస్తున్న కారు ఢీకొట్టడంతో పోలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనూక్ కు వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్