వైసీపీ కనిగిరి మండలం అధ్యక్షునిగా ఇటీవల ఎంపికైన జడ్పీటీసిీ సభ్యులు మడతల కస్తూరి రెడ్డిని వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ బుధవారం సన్మానించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శాలువాతో కస్తూరి రెడ్డిని సన్మానించారు. కనిగిరి మండలంలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని కస్తూరి రెడ్డికి సూచించారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు.