కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల 21న కనిగిరిలో భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ నాయకులు తెలిపారు. గురువారం కనిగిరి పట్టణంలోని స్థానిక షాది ఖానాలో అంజుమన్ కమిటీ నాయకులు సమావేశం నిర్వహించారు. అంజుమన్ కమిటీ నాయకులు సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక విరుద్ధంగా కేంద్రం సవరణ చట్టం తెస్తుందన్నారు.