నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం మంత్రి నారా లోకేష్ వచ్చిన సందర్భంగా, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆయనను కలిశారు. లోకేష్ను ఉగ్ర ఆప్యాయంగా అభివాదం చేస్తూ, కనిగిరి అభివృద్ధికి చేస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.