కనిగిరి పట్టణంలోని కేటీఆర్ స్కూల్ వద్ద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం 7: 30 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుందని ఆలయ అధ్యక్షులు తిరుపతిరెడ్డి గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.