సోలార్ పవర్ ద్వారా విద్యుత్ ఆదా అవుతుందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి అన్నారు. శనివారం కనిగిరి పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో పి ఎం సూర్య ఘర్ రూఫ్ టాప్ సోలార్ స్కీం పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్తో అధిక కరెంటు బిల్లుల నుండి వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందన్నారు. డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నారు